ఎవరూ కిడ్నాప్‌ చేయలేదు.. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం: ప్రియాంక

22 Apr, 2022 07:27 IST|Sakshi
తహసీల్దార్‌తో మాట్లాడుతున్న ప్రేమజంట   

సాక్షి, గుంతకల్లు రూరల్‌: బుగ్గసంగమేశ్వరాలయంలో ఇటీవల వివాహం చేసుకున్న ఓ జంట తహసీల్దార్‌ రామును గురువారం ఆశ్రయించింది. వివరాలు.. మైదుకూరుకు చెందిన ప్రియాంక అనే సచివాలయ ఉద్యోగి, గుంతకల్లు పట్టణానికి చెందిన సుమంత్‌ అనే యువకుడు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరూ ఈనెల 18న గుంతకల్లు సమీపంలోని బుగ్గ సంగమేశ్వరాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.

తమ కూతురు కిడ్నాప్‌ అయ్యిందని ప్రియాంక తల్లిదండ్రులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ జంట తహసీల్దార్‌ను కలిసి తామిద్దరూ ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నామని తెలిపింది. తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని యువతి ప్రియాంక తహసీల్దార్‌కు తెలిపింది. తహసీల్దార్‌ సమక్షంలో మరోమారు దండలు మార్పించి ఒక్కటి చేశారు.   

చదవండి: (త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి)

మరిన్ని వార్తలు