విశాఖ టీడీపీకి జీవీఎంసీ షాక్‌..!

31 Jan, 2021 15:04 IST|Sakshi

17 లక్షలు ఆస్తి పన్ను బకాయి చెల్లింపులో జాప్యం

టీడీపీ కార్యాలయానికి జప్తు నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయం

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు జప్తు నోటీసులు సిద్ధం చేశారు. నగరంలోని సెవెన్ హిల్స్ సమీపంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయం 2020-21 సంవత్సరానికి 27 లక్షల రూపాయలు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ కేవలం పది లక్షలు మాత్రమే టీడీపీ కార్యాలయం నిర్వాహకులు చెల్లించగా, 17 లక్షలు బకాయి పడ్డారు. (చదవండి: టీడీపీలో రాజీనామాల పర్వం..)

మిగిలిన చెల్లింపులు కోసం అధికారులు నోటీసులు పంపించిన కానీ టీడీపీ కార్యాలయం నుంచి సరైన స్పందన లేకపోవడంతో  17 లక్షల ఆస్తి పన్ను బకాయిలకు గాను జీవీఎంసీ అధికారులు జప్తు నోటీసును సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసిన తెలుగు తమ్ముళ్లు.. గతంలో ఎక్కువ మొత్తం ఆస్తిపన్ను నిర్ణయించడంతో సవరించాలని కోరామని.. అందుకే చెల్లింపులో జాప్యం జరిగిందని చెబుతున్నారు.(చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా..

>
మరిన్ని వార్తలు