శిరోముండనం కేసును సీబీఐకి అప్పగించండి

3 Mar, 2021 04:06 IST|Sakshi

హైకోర్టులో బాధితుడు ప్రసాద్‌ పిటిషన్‌ 

కౌంటర్ల దాఖలుకు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం పోలీసులు తనకు శిరోముండనం చేసిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బాధితుడు ఐ.ప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ విచారణ జరిపారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినా కూడా పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఈ కేసులో దర్యాప్తును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు