సాక్షి, విజయవాడ: నగరంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటితో జలమయమైన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దాంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సైలెన్సర్లలోకి నీళ్లు వెళ్లటంతో ఆటోలు, బైక్లు మొరాయిస్తున్నాయి. వన్టౌన్లోని కొన్ని ప్రాంతల్లో వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చేసింది. ఈ ప్రాంతంలోని గణపతి రావు రోడ్, గాంధీబొమ్మ సెంటర్, మహాలక్ష్మి టెంపుల్ స్ట్రీట్, నైజం గేట్ సెంటర్ రోడ్లు జలమయం అయ్యాయి. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడతో పాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.