విజయవాడ: స్పా పేరిట హైటెక్‌ వ్యభిచారం..

13 Dec, 2022 04:05 IST|Sakshi

పటమట(విజయవాడతూర్పు): మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్‌ నిర్వాహకులను సోమవారం పటమట పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురునానక్‌ కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణమండపం సమీపంలో ఉన్న కె.సూ్టడియోలో మసాజ్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని, దీనిపై తమకు అందిన సమాచారంతో తాము దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను, ఎనిమిది మంది యువతులను, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నామని సీఐ కాశీనాథ్‌ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.   

మరిన్ని వార్తలు