కరోనా సోకిందని ఇంట్లో పెట్టి తాళం

27 Jul, 2020 04:19 IST|Sakshi
యజమానితో ఇంటి తాళం తీయిస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లాలో ఘటన 

సత్తెనపల్లి: కరోనా సోకిందని ఓ కుటుంబాన్ని ఇంట్లో పెట్టి ఇంటి యజమాని తాళం వేసిన ఘటన ఆదివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జరిగింది. ఓ కుటుంబానికి కరోనా సోకడంతో ఇంటి యజమాని వారిని ఇంట్లో పెట్టి తాళం వేసింది. బాధితులు ఫోన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకుని బాధితులను విడిపించి ఇంటి యజమానిని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు