AP: రాజధానిలో 900.97 ఎకరాల్లో పేదలకు ఇళ్లు

29 Oct, 2022 11:36 IST|Sakshi

5 గ్రామాల పరిధిలో భూమి ఇళ్లస్థలాలకు వినియోగం

సీఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ జోన్లలో మార్పు 

డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం 

నవంబర్‌ 11 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ

సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాలను గృహ అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా సీఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌లోని జోన్‌లలో మార్పులు చేసింది.
చదవండి: ఎగుమతుల హబ్‌గా ఏపీ..

ఈ మేరకు శుక్రవారం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న అఫర్టబుల్, ఈడబ్ల్యూఎస్‌ హౌసింగ్‌ జోన్‌తోపాటు రెసిడెన్షియల్‌ జోన్‌ నిబంధనల్లో మార్పులు చేస్తూ కొత్త జోన్‌ను తీసుకురానుంది. దీనిపై నవంబర్‌ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపింది.  

మరిన్ని వార్తలు