కర్నూలులో హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ప్రారంభం 

1 Sep, 2021 11:51 IST|Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ (హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ – హెచ్‌ఆర్‌సీ) కార్యాలయాన్ని ఆ సంస్థ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులకు సీతారామ్మూర్తి ధన్యవాదాలు తెలిపారు. సమయం తక్కువగా వుండటం వల్ల కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.

ఇవీ చదవండి:
కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కదిలించిన ‘సాక్షి’ కథనాలు 
కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్‌.. 

మరిన్ని వార్తలు