కరోనా కట్టడికి భారీగా నియామకాలు

4 Oct, 2020 03:55 IST|Sakshi

స్పెషలిస్టులు, జీడీఎంవో, స్టాఫ్‌ నర్సులు, శిక్షణ నర్సులు, పారిశుధ్య సిబ్బందిని నియమించాలని సర్కార్‌ నిర్ణయం

సాక్షి, అమరావతి: కరోనాను ఎదుర్కోవడంలో ముందంజలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనేందుకు పెద్దఎత్తున వైద్య సిబ్బందితోపాటు ఇతర సేవలకు సంబంధించి అదనపు సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టింది. కోవిడ్‌–19 సేవల నిమిత్తం స్పెషలిస్ట్‌ డాక్టర్లు, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు (జీడీఎంవో), స్టాఫ్‌ నర్సులు, శిక్షణ నర్సులు, పారిశుధ్య సిబ్బంది కింద మొత్తం 30,887 మందిని నియమించాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఇప్పటికే 20,916 మందికి సంబంధించిన నియామక ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఆసుపత్రుల్లో అవసరమైన బెడ్లను ప్రభుత్వం ఏర్పాటుచేస్తూనే మరోవైపు ఈ నియామకాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇవన్నీ రెగ్యులర్‌ నియామకాలకు అదనంగా.. ప్రత్యేకించి కోవిడ్‌–19 కోసం చేపడుతోంది.

మరిన్ని వార్తలు