భీమవరం ఉండి రోడ్డులో భారీ పేలుడు

13 Aug, 2021 19:16 IST|Sakshi

పశ్చిమ గోదావరి: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా  భీమవరం ఉండి రోడ్డులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి అక్కడ భారీ గుంత ఏర్పడింది. ఖాలీ స్థలంలో ఆవు గడ్డి మేస్తుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు