తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు.. 

25 Apr, 2021 09:37 IST|Sakshi
సాగర్‌నగర్‌ తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు కళేబరం 

కొమ్మాది (భీమిలి): విశాఖలోని సాగర్‌నగర్‌ తీరానికి శనివారం భారీ తాబేలు కళేబరం కొట్టుకుని వచ్చింది. ఈ తరహా తాబేలు సాగర జలాల్లో సంచరిస్తుంటాయి. ఇవి గుడ్లు పెట్టేందుకు సముద్రపు ఒడ్డుకు వచ్చే సమయంలో వలలో చిక్కుకుని పడవ చక్రాలకు తగిలి మృత్యువాత పడుతుంటాయని మత్స్యకారులు తెలిపారు. ఒక్కోసారి సముద్రంలో కాలుష్యం ఎక్కువ అవుతున్నప్పుడు కూడా మరణిస్తుంటాయని పేర్కొన్నారు.

చదవండి: టీడీపీ నేతకు షాక్‌: అక్రమ నిర్మాణం కూల్చివేత..   
‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్‌  

మరిన్ని వార్తలు