ఉత్తర శ్రీలంకపై ‘బురేవీ’ ప్రభావం 

3 Dec, 2020 16:35 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళ తీరాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. ఉత్తర శ్రీలంకపై  గత ఆరు గంటలలో 11 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి లాట్ సమీపంలోని మన్నార్ గల్ఫ్ వద్ద బురేవీ తుపాను కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మన్నార్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 30 కి.మీ, పంబస్‌కు తూర్పు-ఆగ్నేయంలో 40 కి.మీ, కన్యాకుమారికి తూర్పు-ఈశాన్యంగా 260 కి.మీ. దూరంలో ఉందని తెలిపింది. (చదవండి: 2022 కల్లా తూర్పు నావిక దళంలోకి ‘విక్రాంత్‌’)

దక్షిణ తమిళనాడు తీరం పంబన్, కన్యాకుమారి మధ్య నేడు రాత్రి, రేపు  తెల్లవారు జామున సైక్లోనిక్ తుపానుగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ సమయంలో  70-80 కి.మీ  వేగంతో బలంగా గాలులు వీచే అవకాశం ఉందని, దక్షిణ తమిళనాడు తీరప్రాంత జిల్లాలతో పాటు రామనాథపురం, కన్యాకుమారి జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. (చదవండి: తీరం దాటినా.. తుపాన్‌గానే..)

మరిన్ని వార్తలు