AP: గుడ్‌న్యూస్‌.. టెన్త్‌ పరీక్షల సిబ్బందికి రెమ్యునరేషన్‌ ఎంత పెరిగిందంటే?

21 Apr, 2023 09:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

టెన్త్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో 26 కేటగిరీల్లో పనిచేసే వారి భృతి పెంపు 

పేపర్‌ సెట్టర్‌కు ఒక్కో పేపర్‌కు రూ.880 నుంచి రూ.1,320 చెల్లించేందుకు నిర్ణయం

అనువాదకులకు ఒక్కో పేపర్‌కు రూ.770 నుంచి రూ.1,155కి పెంపు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 26 కేటగిరీల్లో విధులు నిర్వర్తించే అధికా­రులు, సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్‌ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య­కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ గురువారం ఉత్త­ర్వులు (జీవో 37) విడు­దల చేశారు. పరీక్షల నిర్వ­హణతో పాటు స్పాట్‌ వా­ల్యుయేషన్‌ (మూల్యాంకనం)లో పాల్గొనే వారంద­రి రెమ్యు­నరేషన్‌ను ప్ర­భు­­త్వం పెంచింది.

ఎమ్మెల్సీ, వరీక్షల డైరెక్టర్‌ హర్షం
ఉత్తర్వులు ఇచ్చి­నందుకు సీఎం వైఎస్‌ జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారా­యణకు ఎమ్మెల్సీ టి.కల్పలత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ డైరెక్టరేట్‌ తరఫున కృతజ్ఞతలు తెలి­యచేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి పేర్కొ­న్నా­రు.

2016 తరువాత రెమ్యునరేషన్‌ ఇప్పుడే పెరిగిందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్య­క్షుడు గిరిప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌­రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల వైఎ­స్సా­ర్‌టీఎఫ్‌ నేత జాలిరెడ్డి ధన్య­వాదాలు తెలిపారు.
చదవండి: ఏపీ ప్రజలకు అలర్ట్‌.. అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఈ రోజు 48 మండలాల్లో..

మరిన్ని వార్తలు