ఇండోనేషియాకు కోవిడ్‌పై పోరాటంలో భారత్‌ భారీ సాయం

24 Jul, 2021 14:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కోవిడ్‌పై పోరాటం చేయడానికి ఇండోనేషియాకు భారత్‌ భారీ సాయం అందించింది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా రాజధాని జకార్తాకు భారత నౌక ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ చేరుకుంది. ఆ నౌకలో100 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ సామర్థ్యంతో 5 క్రయోజనిక్‌ ట్యాంకర్లు,300 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను పంపింది. భారత్‌, ఇండొనేషియా దేశాల మధ్య సాంస్కృతిక, వ్యాపార ద్వైపాక్షిక సంబంధాలు కలిగి వున్నాయి.

మరిన్ని వార్తలు