సాక్షి, విజయవాడ: ఏపీ రాజ్భవన్లో ఇంటర్నేషనల్ రెడ్క్రాస్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ రెడ్ క్రాస్ ఛైర్మన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ నజీర్.. కలెక్టర్లతో పాటు పలువురికి మెడల్స్ అందజేశారు. అనంతరం గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం. గ్లోబల్ వార్నింగ్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ను కలిసిన సిక్కు మత పెద్దలు.. కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్