సాక్షి, సూళ్లూరుపేట: షార్లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 17న సాయంత్రం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో (వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. చదవండి: గగనం.. దూరం