రాజకీయాల కోసం వాడుకుంటున్నారు!

12 Aug, 2020 08:14 IST|Sakshi

సాక్షి, అమరావతి : అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని క్రెడాయ్‌ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా)పై రుద్దడం పట్ల ఆ సంస్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ సంస్థ పేరును ఉపయోగించుకుని ఉద్యమాన్ని నడిపిస్తుండడంపై క్రెడాయ్‌ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. (విజయవాడ ఘటనపై స్పందించరేం బాబూ?)

► ప్రతిపక్ష నేత చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్న అమరావతి పరిరక్షణ సమితి, దాని జేఏసీకి నేతృత్వం వహిస్తున్న బిల్డర్లు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, ఆర్‌వీఎన్‌ స్వామి తదితరులు క్రెడాయ్‌ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, ఇది తగదని ఆ సంస్థ ప్రతినిధులు అంటున్నారు.  
► ఇటీవల జరిగిన అసోసియేషన్‌ సమావేశంలోనూ అమరావతి పరిరక్షణ ఉద్యమం పేరుతో క్రెడాయ్‌ అసలు లక్ష్యం, దాని ప్రాధాన్యతను కొందరు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది.  
► ఈ నేపథ్యంలో క్రెడాయ్‌ పేరుతో రాజధాని ఉద్యమం చేసే వారికి అడ్డుకట్ట వేయాలని ఆ సంస్థ నిర్ణయించింది.  
► త్వరలోనే క్రెడాయ్‌కి, అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా చెప్పనుంది.  

క్రెడాయ్‌కి సంబంధం లేదు
రాజధాని ఉద్యమంతో క్రెడాయ్‌కి ఎటువంటి సంబంధం లేదు. రియల్టర్లు, బిల్డర్ల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించుకుని పరిష్కరించుకోవడానికే క్రెడాయ్‌ ఏర్పాటైంది. క్రెడాయ్‌కి రాజకీయాలతో ఏ సంబంధం లేదు. కొందరు వ్యక్తిగతంగా ఉద్యమంలో పాల్గొని క్రెడాయ్‌ పేరును వాడుతున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత ఇస్తాం.

మరిన్ని వార్తలు