కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి

20 Apr, 2021 05:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం చైర్మన్‌గా తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి నియమితులయ్యారు. తక్షణమే బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్‌19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలను ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రతిరోజు పర్యవేక్షిస్తుంది. 

మరిన్ని వార్తలు