నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

27 Sep, 2020 04:57 IST|Sakshi

ఏపీలో 30 చోట్ల నిర్వహణ

సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2020 పరీక్ష ఆదివారం జరగనుంది. రాష్ట్రంలో 30 చోట్ల ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం పేపర్‌–1, మధ్యాహ్నం పేపర్‌–2 పరీక్ష జరుగుతుంది. రెండు పేపర్లు తప్పనిసరిగా రాయాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 2.50 లక్షల మంది అర్హత సాధించినా 1.60 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కంప్యూటరాధారితంగా ఆబ్జెక్టివ్‌ తరహాలో పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కులు కూడా ఉంటాయి.
 
► పేపర్‌–1 ఉదయం 9 గంటల నుంచి, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకల్లా అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో రిపోర్ట్‌ చేయాలి.
► అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతో పాటు ఇతర అధికారిక గుర్తింపుకార్డు తీసుకురావాలి. 
► కోవిడ్‌–19 సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం కూడా సమర్పించాలి. గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక పరీక్ష సమయానికి అరగంట ముందు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు.
► కోవిడ్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరడుగుల భౌతికదూరం పాటించాలి. కేటాయించిన సీట్ల వద్ద కంప్యూటర్‌ స్క్రీన్‌పై అభ్యర్థి పేరు, ఫొటో, జేఈఈ రోల్‌ నంబర్‌ కనిపిస్తాయి.
► రోల్‌ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్‌ కావచ్చు.
► ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు శానిటైజర్, వాటర్‌ బాటిళ్లు తెచ్చుకోవాలి. 
► షూస్‌ కాకుండా ఓపెన్‌ పాదరక్షలు మాత్రమే ధరించాలి. 

>
మరిన్ని వార్తలు