ఏపీ కల్చర్‌ కమిషన్‌ క్రియేటివ్‌ హెడ్‌గా జోగి నాయుడు 

19 Feb, 2023 05:12 IST|Sakshi

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ క్రియేటివిటీ అండ్‌ కల్చర్‌ కమిషన్‌ క్రియేటివ్‌ హెడ్‌గా సినీనటుడు ఎల్‌.జోగి నా­యుడుని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్య­దర్శి డాక్టర్‌ రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్‌లోని చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినా­యు­డు చలనచిత్ర నటుడిగా 150­కి పైగా చిత్రాలలో నటించారు.

చిత్ర, టెలివిజన్‌ రంగాలలోని పలు విభా­గాలలో దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉంది. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. జోగి నాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్‌ క్రియేటివిటీ అండ్‌ కల్చర్‌ కమిషన్‌ విజయవాడ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ తదుపరి చర్యలు చేపట్టనున్నారు.   

మరిన్ని వార్తలు