ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం

24 Feb, 2023 09:43 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, మంత్రులు, న్యాయమూర్తులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజ్‌భవన్‌లో హై టీ కార్యక్రమం నిర్వహించారు.

కాగా, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. 1983 లో లా డిగ్రీ అనంతరం ఆయన న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2003 నుంచి 2017 వరకు కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. న్యాయమూర్తిగా పని చేశారు. 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు.

మరిన్ని వార్తలు