సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

28 Jan, 2023 09:30 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 28న జరిగే విచారణకు హాజరవుతున్నానని తెలిపారు. ‘‘వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైన దగ్గరనుంచి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోంది. తప్పు దోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తున్నారు. అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నా’’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

‘‘ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలి. తనతోపాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలి. ఈ విజ్ఞప్తులను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలి’’ అని సీబీఐని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు