ఎల్‌బ్రస్‌ శిఖరం అధిరోహించిన తెలుగు యువతి

16 Aug, 2021 11:45 IST|Sakshi
సుతాపల్లి దేవి

భానుగుడి (కాకినాడ సిటీ): యూరప్‌ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్‌ శిఖరంపై.. మన స్వాత్రంత్య్ర దినోత్సవం నాడే మువ్వన్నెల జెండా రెపరెపలాడించి సంచలన రికార్డు నమోదు చేసిందో యువ ట్రెక్కర్‌. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సుతాపల్లి దేవి(23)కి ట్రెక్కింగ్‌ అంటే అమితాసక్తి. ఆ ఆసక్తితోనే యూరప్‌ దేశాల్లోనే అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రస్‌ శిఖరాన్ని (5,672 మీటర్లు) కేవలం నాలుగు రోజుల్లో అధిరోహించి.. అక్కడ మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఔరా! అనిపించింది.

ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం వచ్చిన రోజునే ఎల్‌బ్రస్‌ శిఖరంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించడం తన జీవితంలో మరచిపోలేని ఆనందక్షణాలని సంతోషం వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు