కిక్‌ బాక్సింగ్‌ లీగ్‌ ప్రారంభం

4 Jun, 2022 22:53 IST|Sakshi
తలపడుతున్న మహిళా బాక్సర్లు 

విశాఖ స్పోర్ట్స్‌: విశాఖ నగరంలోని స్వర్ణభారతి  ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం కిక్‌ బాక్సింగ్‌ ఇండియా లీగ్‌ను రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు 12 వెయిట్‌ కేటగిరీల్లో రెండు కాంటాక్ట్స్‌ విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ కేంద్రం అన్ని విధాలు క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. ఎంఎల్‌సీ పి.వి.ఎన్‌ మాధవ్, మేడపాటి రవీంద్ర, నిర్వాహక కమిటీ ప్రతినిధులు కె.నరసింహారావు, సునీల్‌కుమార్, సతీష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు