సాక్షి, తిరుమల : తిరుమలలో ఆదివారం కిడ్నాప్ కలకలం సృష్టించింది. వివరాలు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన హనుమంతరావు(40) కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. కాగా ఎస్.పి.టి రెస్ట్ హౌస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వచ్చి హనుమంతరావును కిడ్నాప్ చేశారు. కళ్ల ముందే దుండగులు కిడ్నాప్ చేయడంతో అతని కుటుంబసభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే దుండగులు కిడ్నాప్కు ఉపయోగించిన వాహనంకు సంబంధించిన బండి నెంబర్ను గుర్తుపట్టిన హనుమంతు భార్య వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. సమాచారంతో రంగంలోకి దిగిన తిరుమల పోలీసులు అలిపిరి వద్ద కాపు కాసి వాహనంతో పాటు కిడ్నాపర్స్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.