Nara Lokesh: జూమ్‌ కాన్ఫరెన్స్‌లో నారా లోకేష్‌కు ఝలక్‌

9 Jun, 2022 13:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేష్‌కు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఝలక్‌ ఇచ్చారు. విద్యార్థులతో నారా లోకేష్‌ నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ పాల్గొన్నారు. వీరిద్దరిని చూడగానే కంగుతిన్న లోకేష్‌ వెంటనే జూమ్‌ లైవ్‌ను కట్‌ చేశారు.

మరోవైపు కొత్తపల్లి రజిని అనే మహిళ మాట్లాడుతూ.. నారా లోకేష్‌ను జూమ్‌లోనే కడిగేసింది. విద్యార్థుల జీవితాలతో ఆటలేంటని నిలదీసింది. ఇక మరో విద్యార్థితో పాటు జూమ్‌లోకి ఎంటరైన గుర్రంపాటి దేవేందర్‌ నారా లోకేష్‌తో వాగ్వివాదానికి దిగారు. పిల్లలకు పరీక్షలు పెట్టొదని ఎందుకు చెప్పాలంటూ నారా లోకేష్‌ను నిలదీశారు. 

చదవండి: (పేద విద్యార్థులపై ట్రోల్స్‌ చేస్తే తాట తీస్తాం)

మరిన్ని వార్తలు