పెద్ద ఆలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు 

15 Dec, 2022 05:02 IST|Sakshi

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ 

సాక్షి, అమరావతి: రూ.25 లక్షలకు పైబడి వార్షికాదాయం కలిగిన 175 పెద్ద ఆలయాల్లో జనవరి నెలాఖరుకు ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయ శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై బుధవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇప్పటికే 16 ప్రధాన ఆలయాల్లో పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేవదాయ శాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్, అదనపు కమిషనర్‌ చంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు