సీఎం జగన్‌తో క్షత్రియ నేతల భేటీ

25 Jun, 2021 09:04 IST|Sakshi
క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను సన్మానిస్తున్న క్షత్రియ నేతలు 

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు క్షత్రియ నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం వారు సీఎంతో భేటీ అయ్యారు. క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ పి.వి.సూర్యనారాయణరాజు, పాతపాటి సర్రాజు, కేకే రాజు, గాదిరాజు నారాయణరాజు తదితరులున్నారు.

చదవండి: వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. 
ఏపీ: ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు

మరిన్ని వార్తలు