ఇలాంటి చేపను ఎప్పుడైనా చూశారా..?

6 Sep, 2021 08:40 IST|Sakshi

స్వర్ణ మత్స్యం  

బైరెడ్డిపల్లె (చిత్తూరు జిల్లా): బంగారు వర్ణంలో నిగనిగా మెరిసే చేప చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లె మండలంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మండలంలోని లక్కనపల్లె చెరువుకు వస్తోన్న వరదనీటికి చేపలు ఎదురీదుతుండగా స్థానికులు గుర్తించి వలవిసిరారు. అందులో 7 కిలోల బరువున్న బంగారు తీగ జాతికి చెందిన చేప చిక్కింది. ఇది పేరుకు తగ్గట్టు బంగారు వర్ణంలో ఉండడంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు.

ఇవీ చదవండి:
రుషికొండ తీరంలో డాల్ఫిన్ల సందడి
ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు

మరిన్ని వార్తలు