శ్రీకాకుళంలో లారీ బీభత్సం

31 Mar, 2021 18:22 IST|Sakshi

సాక్షి ,శ్రీకాకుళం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డు మీద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓ మహిళ జీవితాన్ని చిదిమేసింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఎచ్చెర్ల మండలంలో చిలకపాలెం టోల్ ప్లాజా వద్ద వస్తున్న లారీ అదుపు తప్పి, అక్కడే రోడ్డు పైన పండ్లు అమ్ముకునే మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ కింద పడి తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మహిళ శరీరం నుజ్జునుజ్జయింది.

చదవండి: బావిలో పడ్డ వ్యాన్.. డ్రైవర్‌, క్లీనర్‌ మృతి )

మరిన్ని వార్తలు