జగ్గంపేట: గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్న పాణింగపల్లి జయశంకర్ విధి నిర్వహణలో మృతి చెందారు. మూడు రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన శుక్రవారం విధులకు హాజరయ్యారు. ఉన్నట్టుండి మధ్యాహ్నం కూర్చున్న కుర్చీలోనే వెనక్కి వాలిపోయి మృతి చెందారు. ఆయన మృతదేహానికి వైద్య సిబ్బంది పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
చదవండి: పాపం రెండేళ్ల చిన్నారి.. ఎండలో ఒంటరిగా ఏడుస్తూ...
అక్రమ సంబంధమే ప్రాణం తీసింది..