ప్రేమికుల వ్యవహారంలో భార్యాభర్తలపై దాడి

7 Jan, 2021 10:26 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి రూరల్(గుంటూరు)‌: పట్టణ పరిధిలోని సలాం హోటల్‌ సెంటర్‌లో భార్యాభర్తలపై ముగ్గురోడ్డుకు చెందిన యువకుడు తన అనుచరులతో పోలీస్‌స్టేషన్‌ ముందే దాడికి పాల్పడ్డాడు. సేకరించిన వివరాల ప్రకారం... ముగ్గురోడ్డుకు చెందిన యువకుడు ఆ ప్రాంతంలో చిన్న చిన్న సెటిల్‌మెంట్లు చేస్తూ, తన మాట వినని వారిని తన చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. 15 రోజుల క్రితం సలాం హోటల్‌ సెంటర్‌కు చెందిన యువతీ, యువకులు ప్రేమించుకుని, పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి పరారయ్యారు. (చదవండి: పేలిన గ్యాస్‌ సిలిండర్‌, ఫ్రిజ్‌)

పోలీసులు పారిపోయిన వారిద్దరిని పిలిపించి తల్లిదండ్రులకు అప్పగించగా, తిరిగి వారు పరారయ్యారు. దాంతో ముగ్గురోడ్డుకు చెందిన యువకుడు యువజంట పరారీకి మీరే కారణమంటూ ఈ వ్యవహారానికి సంబంధం లేని ఓ కుటుంబాన్ని పిలిపించి బుధవారం పోలీస్‌స్టేషన్‌ ముందే దాడి చేశాడు. వారు ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడనుంచి పరారయ్యారు. పోలీస్‌స్టేషన్‌ ముందే ఈ సంఘటన జరిగినా ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కూడా పట్టించుకోలేదు. సదరు యువకుడు కాలేజీ విద్యార్థుల మధ్య నెలకొన్న చిన్న చిన్న వివాదాలను ఆసరాగా తీసుకుని, తనదైన శైలిలో సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మరిన్ని వార్తలు