ఎస్‌బీఐ బ్రాంచ్‌లో భారీ కుంభకోణం

30 Jan, 2021 15:16 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : సఖినేటిపల్లి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో భారీ కుంభకోణం వెలుగు చూసింది. బంగారం రుణాలపై సుమారు అయిదు కోట్ల వరకూ స్వాహా చేసినట్లు సమాచారం అందింది. అదే బ్యాంకులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ భారీ స్కాంకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇతనికి మరో ఉద్యోగి సహకరించినట్లు కూడా సమాచారం. అయితే ఖాతాదారులు బంగారం విడిపించుకునే క్రమంలో సదరు ఉద్యోగి జాప్యం చేయడంతో బండారం బయట పడింది. దీనిపై స్పందించిన బ్రాంచ్‌ మేనేజర్.. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నట్లు, స్కాంపై విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు