Viral Video: గూడ్స్‌ రైలు ఎక్కి వ్యక్తి వీరంగం

7 Oct, 2021 18:31 IST|Sakshi

సాక్షి,విజయనగరం: రైల్వే స్టేషన్‌లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. రైల్వే సిబ్బందితో పాటు పోలీసులను కాసేపు ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. గురువారం స్టేషన్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి నిలిచి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి వీరంగం సృష్టించాడు. విషయం తెలుసుకున్న జీఆర్‌పీ పోలీసులు అక్కడికి చేరుకుని వ్యయప్రయాసలతో అతన్ని కిందకు దింపి, అదుపులోకి తీసుకున్నారు. రైల్వే అధికారులు , పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది.

చదవండి: పది కోళ్లను తిన్న కొండచిలువ

మరిన్ని వార్తలు