టెన్త్ పరీక్షలు రద్దు చేయం: మంత్రి సురేష్‌

5 Jun, 2021 12:53 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: టెన్త్‌ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలిస్తే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్‌ ప్రామాణికమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

చదవండి: చిన్నారి సింధుశ్రీ హత్య కేసు: వీడిన మిస్టరీ
విషాదం: నాన్నా... ఇది తగునా !..

మరిన్ని వార్తలు