వరదలపై మం‍త్రి అనిల్‌ కుమార్‌ సమీక్ష

19 Oct, 2020 14:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వరద వస్తూ ఉండటంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ తెలిపారు. సోమవారం ఇరగేషన్‌ కార్యాలయంలో వరదలపై మంత్రి అనిల్‌ కుమార్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమాశానికి ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యార. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ ప్రాజెక్టుల్లో సమస్యలు, చెరువులకు గండ్లు, కృష్ణ-గుంటూరు జిల్లాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తగిన జాగ్రతలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. చదవండి: కరకట్ట నుంచి ఖాళీ చేయండి : మంత్రి అనిల్‌

మరిన్ని వార్తలు