'మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనం'

19 Sep, 2020 13:52 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: నగరంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల్లో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ' వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా రెండోసారి సోమశిల జలాశయం పూర్తిగా నిండింది. మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనం. వర్షాలు బాగా కురుస్తున్నాయి. నెల్లూరులో పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తాం. (సచివాలయ పరీక్షలు: నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ)

సోమశిల నుంచి నీటి విడుదల మరింత పెరుగుతుంది. నదీ తీరంలో నివాసం ఉన్న వారు వెంటనే సహాయక శిబిరాలకు వెళ్లాలి. సోమశిల నుంచి నీటి విడుదల పెరిగే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతం అంతా మునిగిపోయే అవకాశం ఉంది. తీరంలో నివాసం ఉన్న ప్రజలకు పునరావసం కల్పిస్తాం. త్వరలోనే వీరికి స్థలాలు ఇచ్చి సొంత ఇళ్లు కట్టిస్తాం' అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.  (శరవేగంగా నూతన రథం నిర్మాణ పనులు)

>
మరిన్ని వార్తలు