‘విపత్కర పరిస్థితుల్లోనూ పోలవరం పనుల్లో పురోగతి చూపిస్తున్నాం’

2 Jun, 2021 15:02 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పోలవరం పనుల్లో పురోగతి చూపిస్తున్నామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పోలవరంలో మంత్రి అనిల్‌కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎగువ కాఫర్ డ్యామ్‌, అప్రోచ్‌ ఛానెల్ మట్టితవ్వకం పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అప్రోచ్‌ ఛానెల్ మట్టితవ్వకం పనులు కొనసాగుతున్నాయని, 2022 ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

2016 నుంచి పోలవరం ప్రొజెక్ట్ కోసం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏమి చేసిందని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్నా.. పనుల్లో పురోగతి చూపిస్తున్నామన్నారు. మెగా సంస్థలో పని చేస్తున్న ఇద్ధరు ఉద్యోగులు, అయిదుగురు అధికారులను కోల్పోయినందుకు నిజంగా తమకు బాధ అనిపిస్తోందన్నారు. జూమ్ మీటింగ్‌లతో టీడీపీ నాయకులు కాలం వెళ్ల దీస్తున్నారని, తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రావటం లేదని విమర్శించారు. సోషల్ మీడియాలో పనికి మాలిన వెదవలు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.

‘ఇలాంటి కష్టకాలంలో పని చేస్తున్న కార్మికులు, అధికారులను అభినందనిస్తున్నాం. స్పిల్ వే కట్టిన తర్వాత కాపర్ డ్యాం కట్టాల్సి ఉండగా అలా చేయకపోవటం వల్ల డయా ఫ్రం వాల్ దెబ్బ తిన్నది. దీన్ని ఎలా అధిగమించాలని ఆలోచిస్తున్నాం. చంద్రబాబు వాళ్లకు భజన చేసే వాళ్లవే ప్రాణాలు. 2022 ఖరీఫ్ కు పనులు పూర్తవుతాయని చెప్పాం. దానికే కట్టుబడి ఉన్నాం. 1.50 లక్షల అప్రోచ్ ఛానల్ తీసే పనులు జరుగుతున్నాయి’ అని తెలిపారు. 

చదవండి: ‘విపత్కర పరిస్థితుల్లోనూ పోలవరం పనుల్లో పురోగతి చూపిస్తున్నాం’

మరిన్ని వార్తలు