ఆనాడు చంద్రబాబుకు హిందువులు గుర్తురాలేదా..?

5 Jan, 2021 15:20 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మేం స్పందించామని, ఆలయ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. ‘‘వాటికన్ సిటీకి, అమరావతికి సంబంధం ఏంటి?. చంద్రబాబు అమరేశ్వరుని భూములు కూడా దోచుకున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పవిత్రమైన హిందువైతే విజయవాడలో ఆలయాలను ఎందుకు కూల్చారు?. ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తురాలేదా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. (చదవండి: పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు