ఇసుక కొరత లేకుండా చర్యలు: మంత్రి బొత్స

11 Aug, 2021 17:36 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా కార్యాలయాల్లో ఉండాలని అన్నారు. పేదలకు 1.28 లక్షల ఇళ్లు అనంతపురం జిల్లాలో నిర్మిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు