సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు జాతీయ అవార్డు రావడంతో ఆయన సీఎంను కలిశారు. గవర్నెన్స్ నౌ అవార్డుకు రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ప్రభుత్వ సంస్థగా ఏపీ సీడ్స్కు ప్రత్యేక గుర్తింపు రావడంపై సీఎం జగన్ అభినందనలు తెలియజేశారు. కాగా, ఏపీ సీడ్స్కు సామాజిక బాధ్యత కింద జాతీయ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.