అధికారం కోల్పోగానే ముసలి కన్నీరు..

28 Dec, 2020 19:39 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, పశ్చిమగోదావరి: గత టీడీపీ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించిన దాఖలాలు లేవని, అధికారం కోల్పోగానే రైతులపై కపట ప్రేమ చూపిస్తూ ముసలికన్నీరు కారుస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గతంలో రైతు కుటుంబాలను పవన్‌, లోకేష్‌ ఎప్పుడైనా పరామర్శించారా? అని మంత్రి ప్రశ్నించారు. (చదవండి: ఏపీలో ముందే వచ్చిన సంక్రాంతి..)

టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 480 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందించామని పేర్కొన్నారు. టీడీపీని ఒక డ్రామా కంపెనీగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు, లోకేష్‌లు పడుతున్న తిప్పలు చూస్తే జాలేస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. (చదవండి: ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు..)

మరిన్ని వార్తలు