అభివృద్ధి, సంక్షేమం సీఎం జగన్‌కు రెండు కళ్లు

16 Aug, 2021 20:10 IST|Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, శ్రీకాళహస్తి: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన శ్రీకాళహస్తిలో టిట్కో ఇళ్లు, జగనన్న కాలనీల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్న కాలనీలు కొత్త టౌన్‌లుగా తయారవుతాయన్నారు. జగనన్న కాలనీలో ఇంటికొక పండ్ల మొక్క పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు