అమరావతి: వైఎస్ఆర్ శాశ్వత భూహక్కు-భూరక్ష సర్వేను 2023 మార్చి నాటికి పూర్తి చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అన్ని రకాల భూములను సర్వే చేస్తామని ఆయన తెలిపారు. భూతగాదాలు, ఇనాం భూముల సమస్యను పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల పర్యవేక్షణలోనే సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.
చదవండి: కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలను ఆదుకున్నాం: మంత్రి బుగ్గన