Perni Nani: మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందు

7 Apr, 2022 16:13 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: 36 అంశాల అజెండాతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. మరోవైపు ఏపీ కేబినెట్‌ చివరి భేటీ సందర్భంగా మీడియాకు మంత్రి పేర్నినాని వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, కొడాలినాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. తనకు ఊపిరి ఉన్నంత వరకు మీడియాను గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. తనకు మీడియా చేసిన సహాయం అమోఘమని, ఈ మూడేళ్ళలో మీడియా మిత్రులు అందరినీ పేరుతో పిలిచేంత దగ్గరయ్యానని పేర్కొన్నారు. మంత్రిగా అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను అని మంత్రి పేర్ని నాని అన్నారు.

చదవండి: (AP: మంత్రుల పేషీల్లో హడావుడి.. ఇవాళే రాజీనామా..?!)

మరిన్ని వార్తలు