సాక్షి, కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు వీధి వీధి తిరిగినా కుప్పం ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని ఓడించారు. 30 ఏళ్లలో చంద్రబాబు చేయనిది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడేళ్లలో చేసి చూపించారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
మంత్రి రోజా కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కుప్పం ప్రజలు సీఎం వైఎస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది కుప్పమా.. పులివెందులా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కుప్పం రంగు మారింది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎగిరే జెండా మారుతుంది. కుప్పం నుంచి కురుపాం వరకు.. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే. వైఎస్సార్ చేయూతతో మహిళల జీవితాల్లో సీఎం వైఎస్ జగన్ వెలుగులు నింపారు’ అని కొనియాడారు.