125 అడుగుల అంబేద్కర విగ్రహా ఆవిష్కరణపై సమీక్ష

19 Aug, 2020 17:27 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌, విశ్వరూప్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనులను ప్రారంభించాలని మంత్రులు ఆదేశించారు. అదే విధంగా విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని మొదటగా స్వాధీనం చేసుకోవాలని మంత్రి సురేష్ అధి​కారులకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు