వైఎస్సార్‌ షాదీ తోఫాకు దూదేకులు అర్హులే

8 Nov, 2022 15:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్‌ షాదీ తోఫా పథకానికి ముస్లిం దూదేకులు, మెహతార్‌ ముస్లింలు అర్హులేనని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్‌ స్పష్టం చేశారు.

వైఎస్సార్‌ షాదీ తోఫా విషయమై జిల్లా స్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయని ముస్లిం దూదేకుల పొలిటికల్‌ జేఏసీ పేర్కొన్న నేపథ్యంలో.. వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని ఇంతియాజ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల మైనారిటీ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. 

చదవండి: (‘చంద్రబాబు హయాంలో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారు’)

మరిన్ని వార్తలు