సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ విజేత కల్పలతారెడ్డి 

20 Mar, 2021 08:02 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజేత  టి. కల్పలతారెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆమె ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఆరిమండ విజయ శారద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు