కోలుకున్నవారు లక్ష దాటారు

6 Aug, 2020 04:25 IST|Sakshi

ఒకేరోజు 8,729 మంది డిశ్చార్జి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ను జయించిన వారి సంఖ్య లక్ష మార్కును అధిగమించింది. గడిచిన 24 గంటల్లో 8,729 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,354కి చేరగా రికవరీ రేటు 55.97 శాతానికి పెరిగింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 60,576 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 10,128 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,86,461కి చేరింది. మరో 77 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,681కి పెరిగింది. యాక్టివ్‌ కేసులు 80,426 ఉన్నాయి.

మరిన్ని వార్తలు